మహిళలకు విశిష్ట అధికారాలు,హక్కులు, రాజకీయాల్లో వాటాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లే పునాదులు వేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వారి 512 రూపొందించారని పేర్కొన్నారు హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన స్త్రీ సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మనదేశంలో బాల్యవివాహాలు, వరకట్నం నిషేధం, మహిళలకు ఓటు హక్కు సహా విడాకులు, మహిళలకు ఆస్తిలో వాటా వంటి చట్టాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ద్వారానే ఆచరణలోకి వచ్చాయని వివరించారు. స్థానిక సంస్థల్లో 33% మహిళలకు రిజర్వేషన్ను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ చర్యల మూలంగా మహిళలు ఎన్నికలు, పరిపాలన రంగంలోకి ప్రవేశించారని తెలిపారు. రాష్ట్రంలోనీ ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరం లక్ష్యానికి మించి 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేశామని తెలిపారు. రాబోయే నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందజేస్తామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన గ్రీన్ పవర్ పాలసీలో మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్టు తెలిపారు. సోలార్ ఉత్పత్తి రంగాల్లోకి వారిని తీసుకు వస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ శాఖ, ప్రభుత్వంలోని ఇతర శాఖలు కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
అభ్యున్నతికి దోహద పడే ప్రణాళికలు
ADD
RELATED ARTICLES




