MCN NEWS : ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో అమలాపురం – బొబ్బర్లంక ప్రధాన రహదారి నుండి రజకుల పేటకు వయా ఏటిగట్టు మీదుగా ఎంపీ లాడ్స్ (రాజ్యసభ) నిధుల నుంచి 50 లక్షల రూపాయల అంచనాలతో వేయనున్న నూతన తారు రోడ్డుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు.అలాగే గోదావరి గట్టు నుంచి ఎస్సీ కాలనీ మీదుగా వద్దిపర్రు పంచాయితీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని అభివృద్ధి పరుచుటకు ఎంపీ లాడ్స్ (రాజ్యసభ) నుండి 50 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సత్యానందరావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ), కరుటూరి నరసింహారావు,కాయల జగన్నాధం,పి ఎస్ రాజు,జుజ్జవరపు శ్యామల హరిబాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వద్దిపర్రు గ్రామంలో నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES




