MCN NEWS : కాకినాడ. దేశంలో విపత్తు నిర్వహణ రంగంలో విశేష సేవలందించిన సంస్థలు, వ్యక్తులకు గుర్తింపునిస్తూ సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2023, ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆన్లైన్ దరఖాస్తు, ఇతర వివరాలు http://awards.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత, సంస్థల కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవచ్చని.. సంస్థ అవార్డుకు ఎంపికైతే రూ. 51 లక్షలు, వ్యక్తిగతంగా అవార్డుకు ఎంపికైతే రూ. 5 లక్షలు నగదు పురస్కారం లభిస్తుందని వివరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 2024, జనవరి 23వ తేదీన మొత్తం మూడు నగదు అవార్డులను ప్రకటిస్తారని కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు.
ఆపద ప్రబంధన్ పురస్కార్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ADD
RELATED ARTICLES